News April 9, 2025

సూక్ష్మ సేద్యంలో AP నంబర్-1

image

AP: FY25లో 1.17L హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నంబర్‌-1గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్(1.16L హెక్టార్లు), UP(1.02L హె,), కర్ణాటక(97K హె,) TN(91K హె,) ఉన్నాయి. బిందు, తుంపర్ల పరికరాల కోసం కేంద్రం, AP ప్రభుత్వాలు, రైతులు కలిసి ₹1,176Cr వెచ్చించారు. దేశంలో ఈ పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి 10 జిల్లాల్లో అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు ఉన్నాయి.

Similar News

News September 14, 2025

కొందరు MLAలు అసెంబ్లీకి రాకున్నా జీతం తీసుకుంటున్నారు: అయ్యన్న

image

AP: కొందరు MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ ఆలోచించి, మార్గదర్శకాలివ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45రోజులు.. వాటికీ రాకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.

News September 14, 2025

మొటిమలకు ఇవే కారణాలు..

image

అమ్మాయిలను మొటిమలు చాలా ఇబ్బంది పెడతాయి. వాటికి ఎన్నో కారణాలుంటాయి. రాత్రిళ్లు కార్టిసాల్‌ స్థాయులు తగ్గి, కొల్లాజెన్ ఉత్పత్తై చర్మాన్ని రిపేర్‌ చేస్తుంది. మేకప్ తీయకుండా నిద్రపోతే చర్మరంధ్రాల్లో మేకప్‌ అవశేషాలు ఉండి మొటిమలొస్తాయి. పిల్లోకవర్స్ ఉతక్కపోయినా చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియా, మృతకణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలకు నూనె రాసుకొని పడుకుంటే అది సీబమ్‌ ఉత్పత్తిని పెంచుతుంది.

News September 14, 2025

కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్‌గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.