News April 9, 2025

బెల్లంకొండ: విద్యుత్ షాక్‌తో జేఎల్‌ఎం మృతి

image

బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో మంగళవారం విషాద ఘటన జరిగింది. కరెంట్ స్తంభం ఎక్కుతుండగా మాచయపాలెం జేఎల్ఎంగా పనిచేస్తున్న నరసింహారెడ్డి (35) విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. మృతుడు పాపాయపాలెంకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 5, 2025

విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

image

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చన్నారు.

News July 5, 2025

భద్రాద్రి: జులైలో అధిక వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్.!

image

రానున్న ఐదు రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో అక్కడక్కడా ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు గమనించాలని సూచించారు.

News July 5, 2025

KMM: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ బాలికపై మామిడి పాపారావు(30) అనే వ్యక్తి 2023లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారు.