News April 9, 2025
ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Similar News
News January 13, 2026
అజాగ్రత్త వద్దు.. రోడ్డు నియమాలు పాటించండి: ఎస్పీ

వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. సుజాతనగర్లో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి బసిత్ రెడ్డి పాల్గొన్నారు.
News January 13, 2026
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పండగ వేళ నాన్వెజ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఏపీలోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ రేట్ రూ.350 పలుకుతోంది. పట్టణాలు, గ్రామాల్లో అయితే దీనికి అదనంగా రూ.20 కలిపి రూ.370కి విక్రయిస్తున్నారు. అటు తెలంగాణలోని హైదరాబాద్లో కేజీ కోడి మాంసం రూ.300-320 పలుకుతోంది. మిగతా ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మరి మీ ఏరియాలో కేజీ చికెన్ ధర ఎంత?
News January 13, 2026
కోడి పందేలపై డ్రోన్ల వేట.. జూదగాళ్లకు SP వార్నింగ్

జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, గుండాట, పేకాట వంటి జూద క్రీడలు పూర్తిగా నిషేధమని ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. పందాలు నిర్వహించినా లేదా ప్రోత్సహించినా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బరుల వద్ద నిఘా కోసం ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


