News April 9, 2025

ఇస్రో యువిక -2025కు జగిత్యాల విద్యార్థిని

image

ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025 యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైంది. దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మేలో 12 రోజులు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన 12 మందిలో అశ్విని ఒకరు కావడం విశేషం. దీంతో అశ్వినికి టీచర్లు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News July 7, 2025

రోడ్డు ప్రమాదంలో ఆపరేషన్ సింధూర్ జవాన్ మృతి

image

పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన ఆయన, కుటుంబంతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగేశ్వరరావు కుమారుడు అవినాశ్ అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావు చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మరణించారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

News July 7, 2025

అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం

image

AP: అమరావతి <<16882676>>క్వాంటమ్ వ్యాలీ<<>> డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని లక్ష్యమని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించింది.

News July 7, 2025

కాసేపట్లో ఐసెట్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్-2025 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. జూన్ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు 71, 757 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 64,398 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా పొందవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌పై హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి.