News April 9, 2025
గద్వాల: శతాధిక వృద్ధురాలు మృతి

గట్టు మండలం ఆరగిద్దకి చెందిన శతాధిక వృద్ధురాలు పటేల్ గంగమ్మ (110) మంగళవారం సాయంత్రం చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. గంగమ్మకు ఇద్దరు మగ పిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు. వృద్ధురాలు మరణించడం పట్ల గ్రామస్థులు, గ్రామ ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.
Similar News
News January 17, 2026
మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు SMలో ఫేక్ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు వస్తే 1930కు ఫోన్ చేయాలన్నారు.
News January 17, 2026
సంగారెడ్డి: నేటి నుంచి సాంసద్ ఖేల్ మహోత్సవ్ పోటీలు

సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మైదానంలో ఈనెల 17 నుంచి 19 వరకు ‘సాంసద్ ఖేల్ మహోత్సవ్’ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ పోటీల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ ఈవెంట్లు ఉంటాయని పేర్కొన్నారు. 15 నుంచి 21 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
News January 17, 2026
50 ఏళ్ల క్రింద మేడారం జాతర.. ఫొటోలు

TG: దాదాపు 5 దశాబ్దాల క్రితం మేడారం జాతర ఎలా ఉండేదో తెలిపే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు సమ్మక్క ఆగమనం, జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. మొక్కులు సమర్పిస్తున్న భక్తుల జనసందోహం అద్భుతంగా ఉంది. 1970 నాటి ఈ అరుదైన చిత్రాలను ఓ మ్యాగజైన్లో ప్రచురించారు.


