News April 9, 2025

ఒంగోలు: మేనకోడలిపై 4ఏళ్లుగా అఘాయిత్యం

image

సొంత మేనమామ మేనకోడలిపై 4 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అఘాయిత్యాన్ని బాలిక తట్టుకోలేక ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసింది. తల్లి అరబ్ దేశంలో పని కోసం వెళ్లింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పుకున్న ఏమి చేయకపోవడంతో 4 సంవత్సరాలుగా మేనమామ చిత్రహింసలు భరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్ పరీక్షలు రాసి పనిచేసుకుంటూ ఉంది. ఎస్సై కృష్ణ పావని కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 6, 2026

మార్కాపురం జిల్లాకు 59 మంది ఇన్‌ఛార్జ్ అధికారులు

image

మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన రోజు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన జిల్లాకు ప్రస్తుతం వివిధ శాఖలకు చెందిన 59 మంది ఇన్‌ఛార్జ్ జిల్లా అధికారులను నియమించారు.

News January 6, 2026

ప్రకాశం, మార్కాపురం జిల్లాలు.. అసలు రూపం ఇదే!

image

ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి భౌగోళిక స్వరూపాన్ని అధికారులు రూపొందించారు. ప్రకాశం జిల్లా 28 మండలాలు, 520 గ్రామాలతో ఉండగా.. మార్కాపురం జిల్లా 21 మండలాలతో 508 గ్రామాలతో స్వరూపాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ఇక విస్తీర్ణం విషయంలో ప్రకాశం జిల్లా 15,58,828.77 ఎకరాలు, మార్కాపురం 14,82,757.24 ఎకరాలు ఉంది.

News January 5, 2026

కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

image

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.