News April 9, 2025
సంగారెడ్డి: తల్లిని వేధిస్తుండని చంపేశాడు

SRD జిల్లా మొగుడంపల్లి మం. ధనశ్రీలో జరిగిన మహమ్మద్ అబ్బాస్ అలీ(25) <<16017699>>హత్య<<>> కేసును చిరాగ్పల్లి పోలీసులు ఛేదించారు. DSP రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాలు.. తన తల్లిని అబ్బాస్ వేధిస్తున్నాడని ఈనెల 6న ఖలీల్ షా, తన స్నేహితుడు మమ్మద్ బిస్త్తో కలిసి హత్య చేశారు. అడ్డొచ్చిన షేక్ అక్బర్ అలీపై బాటిల్తో దాడి చేశారు. నిందితులు పారిపోతూ అటుగా వచ్చిన మరో వ్యక్తిని గన్తో బెదిరించి అతడి బైక్పై పారిపోయారు.
Similar News
News November 9, 2025
వంటింటి చిట్కాలు

* ఫ్రిడ్జ్లో బాగా వాసన వస్తుంటే ఒక చిన్న కప్పులో బేకింగ్ సోడా వేసి ఒక మూలన పెడితే వాటన్నిటినీ పీల్చుకుంటుంది.
* బంగాళదుంప ముక్కలను పదినిమిషాలు మజ్జిగలో నానబెట్టి, పదినిమిషాల తర్వాత ఫ్రై చేస్తే ముక్కలు అతుక్కోకుండా పొడిపొడిగా వస్తాయి.
* దోశలు కరకరలాడుతూ రావాలంటే మినప్పప్పు నానబెట్టేటపుడు, గుప్పెడు కందిపప్పు, స్పూను చొప్పున మెంతులు, అటుకులు వేయాలి.
News November 9, 2025
SVUకు ర్యాగింగ్ మకిలి.. కొత్త అడ్మిషన్ల పరిస్థేంటి.?

గోరుచుట్టపై రోకలిబండలా SVU పరిస్థితి మారింది. ఓ <<18239778>>లెక్చరర్ తీరు<<>>తో అంతంత మాత్రంగా ఉన్న అడ్మిషన్లు మరింత దిగజారే ప్రమాదం నెలకొంది. SVUలో ఇటీవల PG అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు లేకకొన్ని కోర్సులు మూసేశారు. లాంగ్వేజ్ కోర్సుల పరిస్థితి దయనీయం. ఇలాంటి తరుణంలో వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అరకొర అడ్మిషన్లతో నెట్టుకొస్తుంటే ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థుల ఎలా చేరుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి
News November 9, 2025
బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.


