News April 9, 2025
పార్వతీపురం : కంటైనర్లో అంగన్వాడీ కేంద్రం

పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో కంటైనర్లో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీడీపీఓ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామంలో ఐదవ అంగన్వాడీ నిర్వహణకు సచివాలయం వద్ద కంటైనర్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే సాలూరులో ఆసుపత్రులను సైతం కంటైనర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 4, 2026
మారథాన్లో అదరగొడుతున్న ములుగు యువకుడు

ములుగు జిల్లా రాయినిగూడెంకి చెందిన వజ్జ నిఖిల్ కుమార్ మారథాన్ రన్లో దూసుకుపోతున్నాడు. ఈరోజు చెన్నైలో జరిగిన మారథాన్లో 32.186 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి జనవరి 18న జరిగే ముంబాయి మారథాన్ 42 కిలోమీటర్ల పరుగుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతకుముందు హైదరాబాద్లో జరిగిన హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్లను కూడా పూర్తి చేశారు. నిఖిల్ కుమార్ను పలువురు అభినందించారు.
News January 4, 2026
ట్రంప్ తర్వాతి టార్గెట్ ఆ 3 దేశాలేనా?

వెనిజులా అధ్యక్షుడు మదురోను బంధించిన జోష్లో ఉన్న US అధ్యక్షుడు ట్రంప్.. మెక్సికో, క్యూబా, కొలంబియాకూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మెక్సికోను డ్రగ్ ముఠాలు నడుపుతున్నాయని, కొలంబియా కొకైన్ ఫ్యాక్టరీలకు అడ్డాగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికాను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫియాను అంతం చేసేందుకు ఆ దేశాల్లోనూ ఏదో ఒకటి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన లాటిన్ అమెరికా దేశాల్లో కలకలం రేపుతోంది.
News January 4, 2026
ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.


