News March 27, 2024
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఇదే లాస్ట్ ఛాన్స్

TG: గ్రూప్-1 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు టీఎస్పీఎస్సీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇవాళ సా.5 గంటల వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. 563 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుంది. వెబ్సైట్: https://www.tspsc.gov.in/
Similar News
News February 3, 2026
పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

T20 WCతో భారత్ మ్యాచ్ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.
News February 3, 2026
ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్లాండ్పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.
News February 3, 2026
పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<


