News April 9, 2025

వికారాబాద్‌లో రేపు జాబ్‌ మేళా

image

వికారాబాద్‌ ఐటీఐ క్యాంపస్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శ్రీమంత టెక్నాలజీస్ సంస్థలో ఉద్యోగాలు భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసి 18-27ఏళ్లలోపు వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత వసతి ఇస్తారు, HYDలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఉదయం 10.30కి జాబ్ మేళా ప్రారంభం కానుంది.

Similar News

News April 19, 2025

18 సీజన్లలో 22 సార్లు మాత్రమే హ్యాట్రిక్ నమోదు!

image

నిన్నటితో IPL టోర్నీ ప్రారంభమై 18 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ 18 సీజన్లలో మొత్తం 755 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఇప్పటివరకూ 1,130 మ్యాచులు జరగ్గా 104 సెంచరీలు, 1,754 అర్ధ సెంచరీలతో 3,59,361 రన్స్ నమోదయ్యాయి. అలాగే 1,366 డక్స్, 30,825 ఫోర్లు, 13,605 సిక్సులు, 349 మెయిడిన్స్, 13,313 వికెట్లు, 8,519 క్యాచులు, 37 ఫైఫర్స్, 15 సూపర్ ఓవర్లు, 22 సార్లు హ్యాట్రిక్ నమోదవడం విశేషం.

News April 19, 2025

గద్వాల: ‘మంత్రి రాకతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు’

image

గద్వాల జిల్లాలో భూభారతి అవగాహన కార్యక్రమంలో ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో అధికారులు గుంతలు ఉన్న ప్రధాన రోడ్డులకు మట్టి వేసి చేతులు దులుపుకున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లు వల్ల జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నా అధికారులు మాత్రం స్పందించలేదని, మంత్రి వస్తున్న నేపథ్యంలో రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

News April 19, 2025

హాజీపూర్: ‘ప్రజా సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది’

image

ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మర్చిపోయిందని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. జై బాబు, జై భీమ్‌, జై సంవిధాన్, కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం హాజీపూర్ మండలంలోని ర్యాలీ నుంచి గడ్పూర్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఆమె సూచించారు.

error: Content is protected !!