News April 9, 2025
పిట్లం: Way2News ఎఫెక్ట్..’వన్యప్రాణుల దప్పిక తీరింది’

ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పిట్లం అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగా అడవిలోని మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సాసర్ పిట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నెల 7న <<16018843>>’వన్య ప్రాణుల గొంతెండుతోంది’ <<>>అనే శీర్షికతో Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ బుధవారం సాసర్ పిట్లలలో నీటి ట్యాంకర్ సహాయంతో నీటిని నింపారు.
Similar News
News January 15, 2026
విశాఖలో ఎగబాగుతున్న భూముల ధరలు(1/2)

విశాఖలో భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తికావడం, ఆనందపురంలో గూగుల్ డేటా సెంటర్ రాక, మధురవాడ–కాపులుప్పాడ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వేగం పుంజుకోవడంతో రియల్ ఎస్టేట్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు విశాఖకు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా గృహావసరాలు, కమర్షియల్ స్పేస్పై డిమాండ్ మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
News January 15, 2026
విశాఖలో ఎగబాగుతున్న భూముల ధరలు(2/2)

చాలా ప్రాంతాల్లో గజం రూ.5 నుంచి 10 వేలు, కమర్షియల్ అయితే గజం రూ.30 వేలు వరకు పెరిగింది. ఈ పరిణామాలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గతేడాది APR నుంచి DEC వరకు సుమారు రూ.800 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ఇందులో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రూ.200.58 కోట్లు, సూపర్ బజార్ రూ.172 కోట్లు, గాజువాక కార్యాలయం రూ.86.28 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.
News January 15, 2026
ఆకర్షణగా ‘I ❤️ MULUGU’

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘I ❤️ MULUGU’ సైన్బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సైన్బోర్డు పట్టణ అందాన్ని మరింత పెంచింది. స్థానికులు, సందర్శకులు ఇక్కడ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ములుగు పట్టణానికి గుర్తింపుగా ఇది మారుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


