News April 9, 2025
3 రోజులపాటు ఆస్పత్రిలోనే మార్క్ శంకర్

సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన Dy.CM పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. రాత్రి ఆస్పత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చామన్నారు. మరో 3 రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు.
Similar News
News July 5, 2025
పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: CM

TG: పిల్లలు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ అన్నారు. HYDలో పోక్సో చట్టంపై జరిగిన స్టేట్ లెవెల్ మీట్లో ఆయన పాల్గొన్నారు. SMను దుర్వినియోగం చేస్తూ పిల్లలు, మహిళలపై దుర్మార్గంగా వ్యవహరించే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. భాగస్వాములందరితో కలిసి ఈ దిశగా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
News July 5, 2025
దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి

TG: ప్రియుడి మోజులో భర్తల్ని భార్యలు చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నారాయణపేట (D) కోటకొండకు చెందిన అంజిలప్ప(32) తన భార్య రాధ చేతిలో హత్యకు గురైన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. రాధకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో ఆమె ఫోన్ మాట్లాడుతుండటం చూసి భర్త మందలించాడు. ఈ క్రమంలో గత నెల 23న మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.
News July 5, 2025
ఏపీ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్?

APలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో SCR పరిధిలో డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి. SCRలో SEC, HYD, నాందేడ్ డివిజన్లు ఉండనుండగా, విశాఖ జోన్లోకి GNT, విజయవాడ, గుంతకల్లు వెళ్తాయి. TGలోని మోటమర్రి, మధిర, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం స్టేషన్లు VJA పరిధిలోకి వెళ్తాయి. GNT పరిధిలోని విష్ణుపురం-పగిడిపల్లి(NLG, మిర్యాలగూడ), జాన్పహాడ్ సెక్షన్లు SECలో కలిపే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.