News April 9, 2025
అమరావతి-HYD గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

AP: విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి-హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. త్వరలోనే అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.
Similar News
News January 27, 2026
ChatGPT, Geminiతోనే ఫుడ్ ఆర్డర్.. స్విగ్గీ ఓపెన్ చేయక్కర్లేదు!

ఇకపై మీ ఫుడ్ ఆర్డర్లను లేదా సరకుల డెలివరీలను ట్రాక్ చేయడానికి స్విగ్గీ యాప్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. నేరుగా ChatGPT, Gemini వంటి AI చాట్బాట్లతోనే పని కానిచ్చేయొచ్చు. ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రొటోకాల్’ సాయంతో స్విగ్గీ ఈ సేవలను ప్రారంభించనుంది. దీంతో చాట్ చేస్తూనే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. సరకులు తెప్పించుకోవచ్చు. యూజర్ల తరఫున AI ఏజెంట్లే ఈ ప్రాసెస్ను పూర్తి చేస్తాయి. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు.
News January 27, 2026
అమరావతికి వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి

AP: రాజధాని అమరావతిని వ్యతిరేకించడం లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ‘పార్లమెంటులో ప్రవేశపెట్టే అమరావతి బిల్లులో రైతులకు ఇచ్చిన హామీలనూ పొందుపరచాలి. వారికి న్యాయం చేయాలి. దీనిపై సభలో చర్చించాలి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే పూర్తిగా నిధులు కేటాయించాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News January 27, 2026
పద్మశ్రీ గ్రహీతపై కాంగ్రెస్ విమర్శలు.. శ్రీధర్ వెంబు కౌంటర్

పద్మశ్రీకి ఎంపికైన IIT మద్రాస్ డైరెక్టర్ ప్రొ.కామకోటిపై కేరళ కాంగ్రెస్ విమర్శలకు జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు కౌంటర్ ఇచ్చారు. ‘మైక్రో ప్రాసెసర్ డిజైన్పై కామకోటి పని చేస్తున్నారు. ఆయన అవార్డుకు అర్హులు. ఆవు పేడ, మూత్రంలో విలువైన మైక్రోబయోమ్లు ఉన్నాయి. ఇవి రీసెర్చ్కు పనికిరావనే బానిస మనస్తత్వం మనది’ అని విమర్శించారు. గోమూత్రాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారని కామకోటిని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.


