News April 9, 2025

నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 4, 2026

రేపు రాజకీయ పార్టీలతో మున్సిపల్ కమిషనర్ భేటీ

image

భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఓటరు జాబితా ముసాయిదాపై సోమవారం ఉదయం 10:30 గంటలకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఉదయ్ కుమార్ తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించిన ఎలక్టోరల్ రోల్ ముసాయిదాపై ఈ భేటీలో చర్చించనున్నారు. పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ సలహాలు, సూచనలు అందజేయాలని ఆయన కోరారు.

News January 4, 2026

రేపు కాకినాడకు ఎంపీ పురంధేశ్వరి, నటుడు కళ్యాణ్ రామ్

image

రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ సోమవారం కాకినాడ విచ్చేస్తున్నారు. నగరంలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు రానున్న వారికి ఘనస్వాగతం పలికేందుకు జిల్లా పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖుల రాకతో కాకినాడలో సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

News January 4, 2026

విడాకులు ప్రకటించిన సెలబ్రిటీ కపుల్

image

జై భానుశాలి-మాహీ విజు దంపతులు విడాకులు ప్రకటించారు. 2011లో పెళ్లి చేసుకున్న వీరు వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా జై హిందీలో అనేక సీరియల్స్‌లో నటించి, డాన్స్ ఇండియా డాన్స్, సరిగమప, సూపర్ స్టార్ సింగర్ తదితర షోలు హోస్ట్ చేశారు. BB 12, 13లలో పాల్గొన్నారు. ఇక BB13కూ వెళ్లిన మాహీ ‘తపన’ మూవీ, ‘చిన్నారి పెళ్లికూతురు, వసంత కోకిల’ తదితర ఒరిజినల్ వెర్షన్ సీరియల్స్‌లో నటించారు.