News April 9, 2025
పెద్దపల్లి: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి: SE

పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ శాఖ SE మాధవ రావు వర్షాకాలంలో సంభవించే ప్రమాదాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలకు తీగలు కట్టి బట్టలు ఆరవేయద్దన్నారు. తడిసిన స్తంభాలు, సపోర్ట్, స్టే వైర్ తాకకూడదు. వ్యవసాయ బావులు, గృహోపకరణాలు తదితర అవసరాలకు అతుకులు లేని వైర్లను వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బందిని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.
Similar News
News January 6, 2026
ఆదిలాబాద్: రూ.50 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,400గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.50 పెరిగినట్లు వెల్లడించారు.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
2025: అన్నమయ్య జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం ఎంతంటే.!

అన్నమయ్య జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి మార్కెటింగ్ శాఖకు AMCల నుంచి రూ.7.55 కోట్ల ఆదాయం లభించింది. రాయచోటి-రూ.29 లక్షలు, మదనపల్లె-2.04 కోట్లు, ములకలచెరువు-1.41 కోట్లు, వాల్మీకిపురం-91.43 లక్షలు, కలికిరి-53.77 లక్షలు, అంగల్లు-56.42 లక్షలు, R.కోడూరు-83.90 లక్షలు, రాజంపేట-50.17 లక్షలు, పీలేరు-24.33 లక్షలు, లక్కిరెడ్డిపల్లి-19.98 లక్షలు వచ్చింది. 2024లో రూ.7.15 కోట్ల ఆదాయం లభించింది.


