News April 9, 2025
పెద్దపల్లి: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి: SE

పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ శాఖ SE మాధవ రావు వర్షాకాలంలో సంభవించే ప్రమాదాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలకు తీగలు కట్టి బట్టలు ఆరవేయద్దన్నారు. తడిసిన స్తంభాలు, సపోర్ట్, స్టే వైర్ తాకకూడదు. వ్యవసాయ బావులు, గృహోపకరణాలు తదితర అవసరాలకు అతుకులు లేని వైర్లను వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బందిని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.
Similar News
News April 6, 2026
భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయా.. అదెలా సర్?

ఉజ్జయినిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2 వేర్వేరు అక్షాంశాల్లో ఉండే లైన్స్ ఎలా కలుస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘భూమధ్య రేఖ(Equator), కర్కాటక రేఖ(Tropic of Cancer).. సమాంతర రేఖలు. అవి కలవవు. మీరు BJPకి ఓటు వేస్తే విద్యావ్యవస్థను తీర్చిదిద్దేది ఇలాంటి వ్యక్తులే’ అని TMC నేత సాకేత్ గోఖలే ఎద్దేవా చేశారు.
News April 6, 2026
రేపే చంద్రుడి సమీపానికి వ్యోమగాములు.. ఫొటోల కోసం వెయిటింగ్!

‘ఆర్టెమిస్-2’ మిషన్ కీలక దశకు చేరుకుంది. రేపు జరగనున్న ‘లూనార్ ఫ్లైబై’ కోసం వ్యోమగాములు సర్వం సిద్ధం చేసుకున్నారని NASA పేర్కొంది. ఇప్పటివరకూ భూమి అద్భుత దృశ్యాలను పంపిన బృందం.. రేపు చంద్రుడిని అత్యంత సమీపం నుంచి ఫొటోలు తీయనుంది. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చందమామ అందాలను దగ్గరగా చూసే సమయం ఆసన్నమైంది. *ఇప్పటివరకూ NASA షేర్ చేసిన ఫొటోలివే..
News April 6, 2026
మరికల్: రైతు కష్టాలు.. రూ.600 కే బస్తా

ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి పంటకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో ఉల్లి రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో చేసేది లేక ట్రాక్టర్ల పై ఉల్లి బస్తాలు పెట్టుకుని ఊరూరా తిరుగుతూ 50 కిలోల బస్తాను రూ.600 చొప్పున విక్రయిస్తున్నారు. మాధవరం గ్రామానికి చెందిన రైతు రాజు ఒక ఎకరాల్లో రూ.70 వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశాడు. మద్దతు ధర లేకపోవడంతో మరికల్ సంతలో విక్రయిస్తున్నాడు.


