News April 9, 2025
పెద్దపల్లి: విద్యుత్తు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి: SE

పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ శాఖ SE మాధవ రావు వర్షాకాలంలో సంభవించే ప్రమాదాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలకు తీగలు కట్టి బట్టలు ఆరవేయద్దన్నారు. తడిసిన స్తంభాలు, సపోర్ట్, స్టే వైర్ తాకకూడదు. వ్యవసాయ బావులు, గృహోపకరణాలు తదితర అవసరాలకు అతుకులు లేని వైర్లను వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బందిని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.
Similar News
News December 16, 2025
SBI యోనో 2.0.. కొత్తగా 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్

SBI తాజాగా యోనో 2.0 పేరుతో నూతన యాప్ను విడుదల చేసింది. కస్టమర్లకు డిజిటల్ సేవలపై అవగాహన కల్పించేందుకు కొత్తగా 6,500 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ‘బ్యాంకింగ్ను సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా MAR 31 నాటికి ఫ్లోర్ మేనేజర్ల స్థాయిలో 10K మంది రిక్రూట్మెంట్కు ప్లాన్ చేశాం. ఇప్పటికే 3,500 మందిని తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
News December 16, 2025
VJA: ప్రశాంతంగా ముగిసిన దీక్షలు.. 5.35 లక్షల మంది భవానీల రాక

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఐదు రోజులపాటు జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ 5 రోజుల్లో మొత్తం 5.35 లక్షల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అత్యధికంగా ఆదివారం 1.49 లక్షల మంది భక్తులు రాగా, చివరి రోజు 1.10 లక్షల మంది దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.
News December 16, 2025
NZB: తుది దశ ఎన్నికలకు రంగం సిద్ధం

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్ కు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూడో విడుత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జర గనుంది. తుది విడుత పోలింగ్లో ఉన్న మొత్తం సర్పంచ్ స్థానాలు 165 కాగా ఇందులో 19 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు.


