News April 9, 2025

పత్తికొండ: మీ ఊర్లో నీటి సమస్య ఉందా.. ఫోన్ చేయండి!

image

పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే తమకు తెలియజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్ ప్రజలను కోరారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, క్రిష్ణగిరి, ఆలూరు, హాళహార్వి, ఆస్పరి, దేవనకొండ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ 8520796952కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 వరకు నీటి సమస్యపై ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

Similar News

News September 30, 2025

కల్లూరు: కారు ఢీకొని 33 గొర్రెలు, కాపరి మృతి

image

కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తిపాడు గ్రామానికి చెందిన కురువ ఎల్ల రాముడు (33) కారు ఢీకొని మృతి చెందాడు. ఉలిందకొండ నేషనల్ హైవేలో గొర్రెలను రోడ్డు దాటిస్తుండగా కర్నూల్ నుంచి వేగంగా వస్తున్న కారు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. 33 గొర్రెలతో సహా కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

News September 30, 2025

జోగుళాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

image

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఏపీ తరఫున జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి జోగుళాంబా సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, కలెక్టర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

News September 30, 2025

కర్నూలు జిల్లా పీఈటీకి అరుదైన అవకాశం

image

కర్నూలు జిల్లా నందవరం జడ్పీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు సూరజ్‌కు అరుదైన అవకాశం లభించింది. ఆంధ్ర రాష్ట్ర బాలుర ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఆయనను నియమించారు. శ్రీనగర్‌లో అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే అండర్-19 జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆంధ్ర రాష్ట్ర బాలుర జట్టుకు ఆయన శిక్షణ ఇవ్వనున్నారు.