News April 9, 2025

అమరావతిలో పెరిగిన భూముల అమ్మకాలు!

image

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న గ్రామాల్లో భూముల విక్రయాలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో చాలా మంది ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు, లాజిస్టిక్ పార్క్ వచ్చే అవకాశం ఉండటంతో రియల్ఎస్టేట్ ఊపందుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ గజం రేటు రూ.20వేలకు పైగా పెరిగిపోయినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.

Similar News

News September 14, 2025

ఒడిశా OAS పరీక్షల్లో టాపర్.. లంచం తీసుకుంటూ..

image

ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (OAS)-2019 టాపర్‌ అశ్విన్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశమైంది. 2021లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన అట్టడుగు వర్గాలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. తహశీల్దార్‌గా పనిచేస్తున్న ఆయనను తాజాగా రూ.15వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టాపర్‌గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

News September 14, 2025

అందుకే.. సాయంత్రం ఈ పనులు చేయొద్దంటారు!

image

సూర్యాస్తమయం తర్వాత వచ్చే సుమారు 45 నిమిషాల కాలాన్ని అసుర సంధ్య వేళ, గోధూళి వేళ అని అంటారు. ఈ సమయంలో శివుడు, పార్వతీ సమేతంగా తాండవం చేస్తాడని నమ్ముతారు. శివతాండవ వీక్షణానందంతో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. ఈ వేళలో ఆకలి, నిద్ర, బద్ధకం వంటి కోరికలు కలుగుతాయి. వీటికి లోనైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ వేళలో నిద్రపోవడం, తినడం, సంభోగం వంటి పనులు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు.

News September 14, 2025

‘నానో బనానా’ మాయలో పడుతున్నారా?

image

‘నానో బనానా’ మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో షేర్ చేయొద్దని TGSRTC MD సజ్జనార్ సూచించారు. ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ట్వీట్ చేశారు. ‘ట్రెండింగ్స్‌ల్లో మీ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ భద్రతే తొలి ప్రాధాన్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఫేక్ సైట్లలో పర్సనల్ డేటా అప్లోడ్ చేసేముందు ఆలోచించాలి. మీ డేటా.. మీ డబ్బు.. మీ బాధ్యత’ అని తెలిపారు.