News April 9, 2025
TG CM రేవంత్పై ఏపీ మంత్రి ఫైర్.. కారణమిదే

PM మోదీని TG CM రేవంత్ గాడ్సేతో పోల్చడంపై AP మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘హామీలు అమలు చేయలేని అసమర్థ CM రేవంత్.. తుమ్మితే ఊడిపోయే తన పదవి కోసం ఇలా మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చడం ఆయనకు అలవాటే. ఆయన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. BJPని అడ్డుకోవడం గాంధీ కుటుంబం వల్లే కాలేదు. ఆ కుటుంబ మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుంది?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 14, 2025
BREAKING: అస్సాంలో భారీ భూకంపం

అస్సాంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. సోనిత్పూర్ జిల్లాలో రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొరుగు దేశాలు చైనా, భూటాన్, మయన్మార్లోనూ భూమి కంపించింది. కాగా ఇవాళ ప్రధాని మోదీ అస్సాంలో పర్యటించిన సంగతి తెలిసిందే.
News September 14, 2025
ఒడిశా OAS పరీక్షల్లో టాపర్.. లంచం తీసుకుంటూ..

ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (OAS)-2019 టాపర్ అశ్విన్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశమైంది. 2021లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన అట్టడుగు వర్గాలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. తహశీల్దార్గా పనిచేస్తున్న ఆయనను తాజాగా రూ.15వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టాపర్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
News September 14, 2025
అందుకే.. సాయంత్రం ఈ పనులు చేయొద్దంటారు!

సూర్యాస్తమయం తర్వాత వచ్చే సుమారు 45 నిమిషాల కాలాన్ని అసుర సంధ్య వేళ, గోధూళి వేళ అని అంటారు. ఈ సమయంలో శివుడు, పార్వతీ సమేతంగా తాండవం చేస్తాడని నమ్ముతారు. శివతాండవ వీక్షణానందంతో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. ఈ వేళలో ఆకలి, నిద్ర, బద్ధకం వంటి కోరికలు కలుగుతాయి. వీటికి లోనైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ వేళలో నిద్రపోవడం, తినడం, సంభోగం వంటి పనులు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు.