News April 9, 2025

రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం

image

AP: ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ చీఫ్ జగన్ రేపు సమావేశం కానున్నారు. తాడేపల్లి కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో భేటీ కానున్నట్లు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మీటింగ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, MLAలు, MLCలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని పేర్కొంది.

Similar News

News September 16, 2025

రూ.1,779 కోట్లు చెల్లించాం.. బంద్ ఆపండి: ఆరోగ్యశ్రీ సీఈవో

image

TG: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలను ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు చెల్లించామని తెలిపారు. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సగటున నెలకు రూ.57 కోట్లు హాస్పిటళ్లకు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ సగటున నెలకు ₹75 కోట్లు చెల్లించామని వివరించారు.

News September 16, 2025

ఆ విగ్రహం మహావిష్ణువుది కాదు.. శనీశ్వరుడుది: AP FactCheck

image

AP: తిరుపతి అలిపిరిలో శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉందంటూ YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ప్రచారం అసత్యమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఆ విగ్రహం అసంపూర్ణంగా చెక్కిన శనీశ్వరునిదని స్పష్టం చేసింది. ‘విగ్రహం తయారీలో లోపం కారణంగా శిల్పి పట్టు కన్నయ్య దీనిని ఇక్కడే వదిలేశారు. పదేళ్లుగా ఈ విగ్రహం ఇక్కడే ఉంది. ఇలాంటి పోస్టులను ఎవరూ సోషల్ మీడియాలో షేర్, పోస్ట్ చేయవద్దు’ అని పేర్కొంది.

News September 16, 2025

తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. రేపే అధికారిక ప్రకటన

image

TG: బీసీ నినాదంతో MLC తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గం.11AMకు ఈ కార్యక్రమం జరగనుంది. ‘బీసీల ఆత్మగౌరవ జెండా రేపు రెపరెపలాడబోతుంది. ఈ తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి చోట బీసీ జెండా ఎగరాలి’ అని మల్లన్న ఆకాంక్షించారు.