News March 27, 2024
SBI డెబిట్ కార్డుల ఛార్జీలు పెంపు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI.. డెబిట్ కార్డు మెయింటనెన్స్ ఛార్జీలను పెంచింది. వివిధ రకాల కార్డులపై ఏడాదికి రూ.75 మేర ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి రూ.125 ఛార్జి చేస్తుండగా, APR 1 నుంచి రూ.200 కానుంది. యువ, గోల్డ్, కాంబో, ప్లాటినం, ప్రైడ్, ప్రీమియం బిజినెస్ కార్డుల ఛార్జీలూ పెరిగాయి.
Similar News
News February 16, 2026
2 అల్పపీడనాలు.. వర్ష సూచన!

దక్షిణ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం ఏర్పడి, అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News February 16, 2026
జీడిమామిడిలో అంతర పంటలు.. లాభాలు

జీడిమామిడి తోటల్లో తొలి ఏడాది అంతర పంటల సాగుకు అనుకూలం. దీని వల్ల కలుపు ప్రభావం తగ్గుతుంది. ఈ తోటల్లో వర్షాధారంగా కర్రపెండలం, పెసలు, మినుము, పశుగ్రాసాలు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పైనాపిల్ను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. దీని వల్ల భూసారంతో పాటు, జీడిమామిడిలో దిగుబడులు కూడా పెరుగుతాయి. అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఈ అంతరపంటలకు కూడా జీడిమామిడితో పాటు సక్రమంగా ఎరువులను అందించాలి.
News February 16, 2026
ఉపవాసం విరమించే ముందు..

ఉపవాసాన్ని విరమించే ముందు ఇంట్లో శివునికి నైవేద్యం సమర్పించాలి. అలాగే దీపారాధన కూడా చేయాలి. వీలైతే పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అన్నదానం తర్వాత ఉపవాసం విరమిస్తే వచ్చే పుణ్యం అనంతం. పారణ చేసేటప్పుడు ‘ఓం నమః శివాయ’ మంత్రం జపించాలని పండితులు సూచిస్తున్నారు. భగవంతునిపై మనసు లగ్నం చేసిన తర్వాత పాటించే ఈ పరిహారాలు అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే విరమణ తర్వాత కూడా ప్రశాంతంగా, భక్తితో ఉండాలి.


