News April 9, 2025
నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. బుధవారం తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో దుద్యాల మండలం హకీంపేట, లగచర్లకు సంబంధించిన స్వంత పట్టా భూములు కలిగిన రైతులకు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తహశీల్దార్ కిషన్లతో కలిసి రైతులకు నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
Similar News
News July 6, 2025
ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ..

బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్లోనూ మెరిశారు. హీరోయిన్గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.
News July 6, 2025
పెద్దపల్లి: జీవో నెంబర్ 282ను రద్దు చేయాలి

జీవో నెంబర్ 282ను వెంటనే రద్దు చేయాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం CITU ఆధ్వర్యంలో జీవో నెంబర్ 282 ప్రతులను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమశక్తిని దోచి, కార్పొరేట్లకు అధిక లాభాలను కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని నాయకులు అన్నారు. 8గంటల పని విధానాన్ని 10గంటలుగా మారుస్తూ చేసిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
News July 6, 2025
NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.