News April 10, 2025

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో బుధ‌వారం రెవెన్యూ వ‌ర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ ప‌ర‌మైన అన్ని అంశాల‌పై, ప్ర‌భుత్వ జీవోల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, రిజిస్ట్రేష‌న్‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై దిశానిర్దేశం చేశారు.

Similar News

News December 25, 2025

విశాఖ వుడా మాజీ అధికారి ఆస్తులు ఈడీ అటాచ్!

image

విశాఖ వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసుపర్తి ప్రదీప్‌కుమార్‌పై దాడులు నిర్వహించి ఈడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తులు జప్తు చేశారని తెలిపారు. జప్తు చేసిన వాటిలో ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.

News December 25, 2025

స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం

image

జీవీఎంసీ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించిందని అదనపు కమిషనర్ పీఎం సత్యవేణి తెలిపారు. జీవీఎంసీ హాల్లో సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపరేషన్ లంగ్స్ లో దుకాణాలు తొలగింపు చేయడం జరిగిందని, విశాఖను అందంగా తీర్చిదిద్దేందుకు రూ.1425 కోట్లతో 250 దుకాణాలను మొదటి ప్రాజెక్టు కింద ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి జోన్లో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక అన్ని జరుగుతాయని తెలిపారు.

News December 25, 2025

విశాఖలో పబ్ నిర్వాహకులకు సీపీ వార్నింగ్

image

విశాఖపట్నం నగరంలోని బార్, పబ్ నిర్వాహకులతో పోలీస్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ధ్వని కాలుష్యం, అక్రమ పార్కింగ్, డ్రగ్స్ వాడకం, మైనర్లకు మద్యం సరఫరాపై సీపీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయపాలన పాటించాలని, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు.