News April 10, 2025
గద్వాల: నకిలీ విత్తనాలపై నిఘా.. రైతులను కాపాడే బాధ్యత పోలీసులదే: ఎస్పీ

నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా, రైతులు మోసపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలో నిర్వహించిన పోలీసుల సమావేశంలో ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధులు ప్రజల్లో నమ్మకం పెంచేలా ఉండాలని, నేరాల నియంత్రణ, శిక్షల శాతం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 6, 2025
విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
News November 6, 2025
ప్రకాశం: చెరువులో పడి విద్యార్థి మృతి

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో విషాదం నెలకొంది. ఈదుమూడి గ్రామానికి చెందిన కటారి అఖిల్(12) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గ్రామంలోని ఊర చెరువులో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
SRSP UPDATE: 21,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఉదయం 9 గంటలకు 4 గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు వెల్లడించారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.


