News April 10, 2025

చెన్నూరు: నాణ్యమైన ధాన్యం కొనాలి: అదనపు కలెక్టర్

image

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనాలని అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ అన్నారు. చెన్నూరులో సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.  కేంద్రాల్లో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు.

Similar News

News September 14, 2025

నెల్లూరులో యువతి దారుణ హత్య.. UPDATE

image

బుచ్చి(M) పెనుబల్లికి చెందిన గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మైథిలీప్రియ (23) బీఫార్మసీ పూర్తి చేసింది. ఆ సమయంలో సహ విద్యార్థి నిఖిల్‌ను ప్రేమించింది. కొన్నాళ్లుగా నిఖిల్‌ మరో యువతితో సన్నిహితంగా ఉండటంపై మైథిలీప్రియ గొడవ పడుతోంది. ఈక్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచి నిఖిల్‌‌ <<17695710>>కత్తితో పొడిచి హత్య<<>> చేశాడు. అనంతరం దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

News September 14, 2025

పులివెందుల మెడికల్ కాలేజీపై మీ మాటేంటి?

image

పులివెందులలో మెడికల్ కాలేజీపై కూటమి, వైసీపీ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. పులివెందులలో మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదని MLC రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. NMC కాలేజీని పరిశీలించిన తర్వాతేగా 50 సీట్లు కేటాయించింది. అంటే NMC కళ్లు మూసుకుని సీట్లు కేటాయించిందా అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీపై కూటమి నేతలు చేస్తున్నది అవాస్తవమని మాజీ ఎంపీ తులసిరెడ్డి ధ్వజమెత్తారు.

News September 14, 2025

మచిలీపట్నంలో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

image

మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.