News April 10, 2025
నేటి నుంచి పాలిసెట్ శిక్షణ తరగతులు ప్రారంభం

పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లందు సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో నేటి నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణను స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 7, 2025
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఆసుపత్రికి సంబంధించి ఓపీ రిజిస్టర్, డిస్పెన్సరీ రిజిస్టర్లను పరిశీలించారు. చిన్నపిల్లలకు టీకాలు ఎప్పుడు ఎప్పుడు వేస్తున్నారు వంటి సమాచారాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
మనందరికీ చారిత్రకమైన సందర్భం: పాడేరు ఎస్పీ

వందేమాతరం గీతం 150వ ఏడాది వేడుకలు మనందరికీ చారిత్రకమైన సందర్భమని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ గీతం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేయడం మనకు గర్వకారణమైన అనుభవమన్నారు. గేయం స్ఫూర్తితో అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది కలిసి పని చేయడం చాలా ముఖ్యమన్నారు. వందేమాతరం గీతం 150వ ఏడాది వేడుకల సందర్భంగా శుక్రవారం పాడేరు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వందేమాతరం ఆలపించారు.
News November 7, 2025
రాష్ట్ర ప్రజల ప్రార్థనల వల్లే విశ్వవిజేతగా నిలిచాం: శ్రీచరణి

రాష్ట్ర ప్రజల మద్దతు, ప్రార్థనల వల్లే ఇండియా ఉమెన్స్ టీమ్ విశ్వవిజేతగా నిలిచిందని ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ శ్రీచరణి అన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆమె మాట్లాడారు. తనకు రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో 1000 గజాల స్థలం కేటాయించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.


