News April 10, 2025
ధర్మవరం: ‘YS జగన్ క్షమాపణలు చెప్పాలి’

YS జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఖండించారు. బుధవారం ధర్మవరంలోని ఎన్జీ హోమ్లో వారు మాట్లాడుతూ.. వేలాది మంది కార్యకర్తలతో రాజకీయ సభలను తలపించే విధంగా తరలి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు 1200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. ఈ వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలన్నారు.
Similar News
News September 17, 2025
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.
News September 17, 2025
వరంగల్: స్కూల్లో క్షుద్ర పూజల కలకలం..!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం సృష్టించింది. నిన్న రాత్రి పసుపు కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం స్కూల్ తెరిచి సరికి చూసి ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
క్షుద్రపూజల ఆనవాళ్లతో గ్రామస్థులు, పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News September 17, 2025
WGL: అయోమయానికి గురిచేస్తున్న పత్తి ధర!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. సోమవారం క్వింటా రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మళ్లీ ఈరోజు(బుధవారం) ధర తగ్గి రూ. 7,440 అయింది. రైతులు తేమలేని, నాణ్యమైన పత్తి మార్కెట్కి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు