News April 10, 2025

నేడు భారత్‌కు ముంబై దాడుల సూత్రధారి!

image

ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన తహవూర్ రాణాను నేడు భారత్‌కు తీసుకురానున్నారు. అమెరికా అధికారుల నుంచి అతడిని అదుపులోకి తీసుకున్న భారత అధికారులు ప్రత్యేక విమానంలో తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో దిగే అవకాశం ఉంది. అనంతరం NIA రాణాను తమదైన శైలిలో లోతుగా విచారించనుంది. 26/11 ముంబై దాడుల్లో 166 మందిని రాణా సహా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు.

Similar News

News January 9, 2026

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

image

AP: బార్లపై విధించే 10% అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్(ARET)ను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో సర్కారుకు ₹340Cr నష్టం రానుంది. అదేసమయంలో మద్యం బాటిల్‌పై ₹10 పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల ₹1,391Cr అదనపు ఆదాయం సమకూరనుంది. క్వార్టర్ ₹99 బ్రాండ్లు, బీర్లపై పెంపు ఉండదు. మున్సిపల్ కార్పొరేషన్లకు 5KM పరిధిలో 3స్టార్, ఆపైన స్థాయి హోటళ్లలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News January 9, 2026

IOCLలో 509 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) ఈస్ట్రన్ రీజియన్‌లో 509 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఇంటర్, డిప్లొమా(ఇంజినీరింగ్), ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు NATS/NAPS పోర్టల్‌లో సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com/

News January 9, 2026

సమ్మె నోటీస్.. నేడు ఏం జరుగుతుందో?

image

AP: సంక్రాంతి వేళ అదును చూసుకుని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 12 నుంచి బస్సులు <<18803654>>నిలిపేస్తామని<<>> ప్రకటించారు. నిన్న మంత్రి రాంప్రసాద్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో భేటీ కానున్నారు. పండుగ సమయంలో దాదాపు 2,500 బస్సులు ఆగిపోతే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. దీంతో ఎలాగైనా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.