News April 10, 2025

21-24 ఏళ్ల యువతకు కామారెడ్డి కలెక్టర్ గుడ్ న్యూస్

image

టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండో దశ ప్రారంభానికి జిల్లాలో ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. పథకానికి దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21-24 ఏళ్లు ఉండాలన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగయి ఉండకూడదన్నారు. అర్హత గల వారు, సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News November 13, 2025

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా కరీంనగర్

image

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.

News November 13, 2025

గద్వాల: డీకే అరుణకు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు

image

మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025పై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లో ఆమెను సభ్యురాలిగా నియమించారు. జమ్మూ కశ్మీర్ పునశ్చరణ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలనూ ఈ కమిటీ పరిశీలిస్తుంది.

News November 13, 2025

నిర్మల్‌లో జిల్లా స్థాయి నెట్‌బాల్ జట్ల ఎంపిక

image

నిర్మల్ NTR మినీ స్టేడియంలో నవంబర్ 15న U-14, U-17 బాల, బాలికల నెట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, SGF కార్యదర్శి ఎ.రవీందర్ గౌడ్ తెలిపారు. పాల్గొనేవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు బోనాఫైడ్, జనన సర్టిఫికేట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డ్, ఆధార్ జిరాక్స్‌లతో హాజరుకావాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు.