News April 10, 2025

నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

image

నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన A.లక్ష్మీ (60) అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈనెల 4న గ్రామానికి చెందిన ప్రత్యర్థులు తనపైన, తన తల్లిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సురేశ్ తెలిపారు. కాగా ఈనెల 7న లక్ష్మీకి కడుపునొప్పి రాగా KGHకి తరలిస్తుండగా మృతి చెందినట్లు సురేశ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI సన్నిబాబు తెలిపారు.

Similar News

News January 4, 2026

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు భద్రం: ఇన్‌ఛార్జ్ SP

image

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్ అంటే ఆశపడవద్దన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మవద్దన్నారు. డాటాను సైబర్ మోసగాళ్ల చేతిలో పెట్టవద్దన్నారు. ఈజీగా లోన్ వస్తుందని చిక్కుల్లో పడవద్దని హెచ్చరించారు.

News January 4, 2026

GHMCలో మరోసారి బదిలీలు.. రంగంలోకి కొత్త JCలు!

image

నగర పాలక సంస్థలో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. GHMC కమిషనర్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ కె.వేణుగోపాల్‌ను మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ల జాయింట్ కమిషనర్‌గా నియమించారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ గీతా రాధికను కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల బాధ్యతలు అప్పగించారు. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు వెలువడ్డాయి.

News January 4, 2026

VKB: 4 మున్సిపాలిటీలు.. 1,74,509 మంది ఓటర్లు

image

వికారాబాద్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 1,74,509 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ఓటర్ జాబితా విడుదల చేశారు. వికారాబాద్ మున్సిపల్‌లో 58,117 ఓటర్లలో మహిళలు 29,339, పురుషులు 28,751 మంది ఉన్నారు. తాండూర్ 77,110 ఓటర్లకు మహిళలు 39,558, పురుషులు 37,547 మంది ఉన్నారు. పరిగి 27,614లో మహిళలు 13,792, పురుష ఓటర్లు 13,822 మంది ఉన్నారు. కొడంగల్ 11,668 మంది ఓటర్లకు మహిళలు 6,007, పురుషులు 5,661 మంది ఉన్నారు.