News April 10, 2025
సిరిసిల్ల: అకాల వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన పండ నేల పాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Similar News
News September 17, 2025
మహారాష్ట్ర క్లబ్లో తెలంగాణ జూదరులు

మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ జూదానికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పేకాట నిర్వహణపై ఉక్కుపాదం మోపడంతో వీరంతా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాకు ఆనుకోని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఇండోర్ క్లబ్ల పేరిట అనుమతులు తీసుకుంటూ నిర్వాహకులు పేకాట నిర్వహిస్తూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు. అక్కడ ఆడే వాళ్లంతా MNCL, ASF జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం.
News September 17, 2025
రేపు వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
News September 17, 2025
సిద్దిపేట: పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: సీపీ

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మిర్జా యూసుఫ్ బేగ్ ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందడంతో సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐని ఆమె అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్దతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి గుర్తింపు, మర్యాద లభిస్తాయన్నారు. రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.