News April 10, 2025
నిర్మల్: కొడుకు పట్టించుకోవడం లేదని SPకి ఫిర్యాదు

కంటికి రెప్పలా కాపాడుకొని పెంచిన పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అలాగే కాపాడుకోవాలి. కానీ కన్న కొడుకే తమను ఇబ్బంది పెడుతున్నాడని ఓ వృద్ధ దంపతులు SP ఆఫీస్ మెట్లెక్కారు. దిలావర్పూర్కు చెందిన నర్సయ్య తన ఆస్తిని పెద్ద కుమారుడి పేరు మీద రాశాడు. ఆపై తమను మనోవేదనకు గురి చేస్తున్నాడని SP జానకి షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు కోసం తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన ఘటనలు తరుచూ చూస్తునే ఉన్నాం.
Similar News
News March 14, 2026
అమరావతిలో బిట్స్ పిలానీ.. 5ఏళ్లలో రూ.1000కోట్ల పెట్టుబడి

AP: రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ ప్లాన్లను మంత్రి లోకేశ్ పరిశీలించారు. ఆ కంపెనీ ప్రతినిధులు ఆయన్ను కలిసి ప్లాన్లను చూపించారు. వీలైనంత త్వరగా క్యాంపస్ను ప్రారంభించేలా చూడాలని మంత్రి వారికి సూచించారు. ఇది దేశంలోనే మొదటి AI క్యాంపస్ అని, 5ఏళ్లలో ₹1000Cr పెట్టుబడి పెడతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండు దశల్లో 7వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.
News March 14, 2026
టుడే టాప్ స్టోరీస్

* AP రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ డబ్బులు జమ
* మూసీ అభివృద్ధిని అడ్డుకోకండి: CM రేవంత్
* LPG సిలిండర్ల సమస్య పరిష్కారానికి AP, TG ప్రభుత్వాల చర్యలు
* TGSRTCలో సమ్మె సైరన్
* మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: మంత్రి లోకేశ్
* దేశంలో ఒక్కరోజే 75లక్షల సిలిండర్ల బుకింగ్స్
* ప్రజలు ఆందోళన పడి సిలిండర్లు బుక్ చేయొద్దు: కేంద్రం
* యుద్ధ ప్రభావంతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
News March 14, 2026
వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్: తుమ్మల

TG: వరి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ క్రమంలో రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, నాణ్యతా ప్రమాణాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.


