News March 27, 2024

NLG: పాతాళానికి గంగమ్మ..

image

వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యధికంగా నీటి నిల్వలు పడిపోయిన జిల్లాల జాబితాలో NLG కూడా చేరింది. జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం 15 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రధానంగా చందంపేట మండలంలో 16 మీటర్ల లోతుకు భూగర్భ జలం పడిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా.. ఇప్పుడు 16 మీటర్ల పడిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది.

Similar News

News March 15, 2026

జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ బి.చంద్ర శేఖర్

image

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య గ్యాస్ నిల్వలు తగ్గినప్పటికీ, జిల్లాలో గృహ అవసరాల (Domestic) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ బి.చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News March 15, 2026

జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ బి.చంద్ర శేఖర్

image

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య గ్యాస్ నిల్వలు తగ్గినప్పటికీ, జిల్లాలో గృహ అవసరాల (Domestic) గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కలెక్టర్ బి.చంద్ర శేఖర్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

News March 14, 2026

NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.