News April 10, 2025

ఇంద్రవెల్లి: భర్తపై ప్రియుడితో కలిసి గొడ్డలితో దాడి

image

భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన ఇంద్రవెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాల్‌పూర్‌ వాసులు సాహెబ్ రావ్, ఎల్లవ్వ‌ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. 4నెలల క్రితం సాహెబ్ రావ్ చిన్నమ్మ కోడుకు దశరథ్ వారి ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. సాహెబ్ పనినిమిత్తం వేరే ఊరికి వెళ్లడంతో ఎల్లవ్వ, దశరథ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త మందలించడంతో అతడిని చంపేందుకు యత్నించారు.

Similar News

News November 4, 2025

మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

image

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.

News November 4, 2025

మహిళల్లో ఫైనాన్షియల్‌ లిటరసీ పెంచాలని..

image

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇన్నర్‌ గాడెస్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది అనన్య పరేఖ్. చెన్నైకు చెందిన అనన్య ఇంజనీరింగ్‌ తర్వాత మహిళల హక్కులు, సాధికారతపై దృష్టి పెట్టింది. వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు వర్క్‌షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎందరికో దారి చూపుతున్నారు.

News November 4, 2025

రాష్ట్రం నుంచి ముగ్గురు.. అందులో ఇద్దరు మనోళ్లే

image

ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్‌పూర్లో ఈనెల 5 నుంచి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్‌లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి.ప్రభాకర్ రెడ్డి, బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 162 మంది సైన్స్ టీచర్లు కాన్ఫరెన్స్‌కు ఎంపికయ్యారు. కాగా, తెలంగాణ నుంచి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులే కావడం గర్వకారణం.