News April 10, 2025

నర్సీపట్నం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

గుల్లిపాడు- నర్సీపట్నం స్టేషన్ మధ్య ట్రైన్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రెండు రోజుల క్రితమే జారిపడి మృతి చెంది ఉంటాడని ఎస్ఐ తెలిపారు. మృతుడు ఎవరు అనేది తెలియరాలేదని, మృతుడు ఎడమ చేయిపై జ్యోతి అనే పచ్చబొట్టు ఉందని ఎస్ఐ వివరించారు.

Similar News

News January 13, 2026

టాక్సిక్ టీజర్ వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న CBFC

image

కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అశ్లీల సన్నివేశాలపై ఆప్ <<18843954>>ఫిర్యాదు<<>> చేయడంతో వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్‌ లేఖ రాసింది. దీంతో యూట్యూబ్‌లో విడుదల చేసే టీజర్లకు సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదని CBFC తెలిపింది. థియేటర్లలో ప్రదర్శించే వాటికే పర్మిషన్ అవసరమని, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫాం కావడంతో తమ పరిధిలోకి రాదని చెప్పింది.

News January 13, 2026

అనంతపురం ఎమ్మెల్యే గన్‌మెన్ సస్పెండ్

image

అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై దాడి ఘటనలో ఎస్పీ జగదీశ్ చర్యలు తీసుకున్నారు. ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు దాడికి సంబంధించిన వీడియోలను అందజేశారు. ఈ ఘటనలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గన్‌మెన్ షేక్షావలి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 13, 2026

670 సార్లు అప్లై చేసినా పట్టించుకోలేదు.. కట్ చేస్తే..

image

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదంటున్నారో టెకీ. ‘రిక్రూటర్లకు 670 అప్లికేషన్లు, 1000 మెసేజ్‌లు పంపినా పట్టించుకోలేదు. దీంతో దరఖాస్తులు ఆపేశా. వ్యక్తిగతంగా ప్రొడక్ట్ బిల్డింగ్, కంటెంట్ క్రియేషన్, నెట్‌వర్కింగ్‌పై ఫోకస్ చేశా. జనవరి-మే మధ్య 83మంది రిక్రూటర్లు సంప్రదించారు’ అని మర్మిక్ పటేల్ అనే వ్యక్తి తెలిపారు. మెటాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు.