News April 10, 2025
WGL: క్రమంగా పెరుగుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400 పలికాయి. అలాగే నేడు (గురువారం) మరింత పెరిగి రూ.7,425కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్కు పత్తి తరలిరాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News September 14, 2025
గన్నవరం ఎయిర్పోర్టు బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి?

గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి బోర్డు సభ్యుల నియామకంపై స్థానిక MLA యార్లగడ్డ వెంకట్రావు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను సంప్రదించకుండా పదవులు ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైస్ ఛైర్మన్ హోదాలో ఉన్నా ఇటీవల జరిగిన బోర్డు సమావేశానికి ఆయన హాజరు కాలేదు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి పదవిని ఇచ్చారని, అతడిని తొలగించాలని కేంద్రమంత్రికి MLA లేఖ రాసినట్లు సమాచారం.
News September 14, 2025
శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.
News September 14, 2025
ఏలూరు: సెప్టెంబర్ 16న కలెక్టరేట్లో జాబ్ మేళా

ఏలూరు జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి సెప్టెంబర్ 16న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కాంపౌండ్లో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు శనివారం తెలిపారు. NCS నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లమో ఉత్తీర్ణత పొందిన 18-26 సంవత్సరాల అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.