News April 10, 2025

YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. TDP సంచలన నిర్ణయం

image

AP: YS భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన iTDP కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు TDP ప్రకటించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరింది. దీంతో గుంటూరు పోలీసులు కిరణ్‌పై కేసు ఫైల్ చేశారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని పార్టీ స్పష్టం చేసింది. కాగా భారతిపై కామెంట్స్‌ చేయడంపై YCP తీవ్రంగా స్పందించింది. దీంతో కిరణ్ <<16049878>>క్షమాపణలు<<>> చెప్పాడు.

Similar News

News December 30, 2025

డైలీ 4వేల అడుగులు వేస్తే మరణ ముప్పు తగ్గినట్లే: అధ్యయనం

image

యువకుల్లా వృద్ధులూ రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 72 ఏళ్ల వృద్ధ మహిళలపై 11 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో.. వారానికి కేవలం 1-2 రోజులు 4,000 అడుగులు నడిచినా గుండె జబ్బులు, మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత నడక వంటి చిన్న చిన్న మార్పులతో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT

News December 30, 2025

రేపు బయటికి రావద్దు!

image

ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటి తెలుగు రాష్ట్రాల్లో రేపు చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉదయం, రాత్రివేళల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పింది. ఇక 31st కావడంతో పార్టీలు చేసుకునేవారూ ఇళ్లలోనే ఉండటం బెటర్. రేపు HYDతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో పోలీసులు పెద్దఎత్తున డ్రంకెన్ డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం సేవించినవారు వాహనాలపై బయటికి రావద్దని సూచిస్తున్నారు.

News December 30, 2025

పడిపోయిన ద్రవ్యోల్బణం.. ఇరాన్‌లో ఆందోళనలు

image

ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ కరెన్సీ దారుణంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 1.38 మిలియన్లకు దిగజారిపోయింది. అణు ఆంక్షల వల్ల ఇరాన్‌ పరిస్థితి అతలాకుతలం అయ్యింది. కరెన్సీ పడిపోవడంతో ద్రవ్యోల్బణం 42.2%కి చేరింది. ఆహార పదార్థాల ధరలు 72% పెరిగాయి. దీంతో టెహ్రాన్‌, ఇస్ఫహాన్, షిరాజ్, మష్హద్‌ సిటీల్లో జనం నిరసనబాట పట్టారు. సెంట్రల్ బ్యాంక్ చీఫ్ మహ్మద్ రెజా రాజీనామా చేశారు.