News April 10, 2025

ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న అమరావతి 

image

ఎన్టీఆర్: ఏప్రిల్ 3వ వారంలో ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ప్రధాని సభ నిమిత్తం అమరావతిలో విశాల ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి అమరావతికి లభించిన నిధులకు కేంద్రం రూ.750కోట్లను కలిపి రూ.4,825 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Similar News

News July 9, 2025

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ ఇవే!

image

2025 ఫస్టాఫ్ టాప్-10 మూవీస్ జాబితాను IMDb విడుదల చేసింది. ఇందులో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఛావా’ మూవీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. రెండు, మూడు స్థానాల్లో డ్రాగన్, దేవా సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత రైడ్ 2, రెట్రో, ద డిప్లొమాట్, ఎంపురన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విదాముయర్చి చిత్రాలు ఉన్నాయి. కాగా టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.

News July 9, 2025

భద్రాద్రి: చెరువులో సింగరేణి ఉద్యోగి గల్లంతు

image

సరదాగా గడుపుదామని బయటకు వెళ్లిన మిత్రబృందంలో ఒకరు గల్లంతైన ఘటన మణుగూరు(M) రేగులగండి చెరువులో బుధవారం చోటుచేసుకుంది. సింగరేణిలో EP ఆపరేటర్‌గా పని చేస్తున్న మంచిర్యాల(D) శ్రీరాంపూర్‌కు చెందిన సుంకరి శ్రీనివాస్ సహోద్యుగులతో కలిసి చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత చెరువులో సరదాగా ఈత కొడుతుండగా అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది.

News July 9, 2025

జనగామ: కష్టపడి ఈ స్థాయికి వచ్చా: డీఈఓ

image

కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని జనగామ డీఈఓ భోజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రార్థన సమయంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాడు సౌకర్యాలు లేకున్నా కష్టపడి చదివానని, నేడు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.