News April 10, 2025
శ్రీ సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.
Similar News
News March 21, 2026
కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

SLBC, డిండి ఎత్తిపోతల, అచ్చంపేట కెనాల్ పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్లెట్ పనులు మొదలైనట్లు స్పష్టం చేశారు. టన్నెల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. సొరంగంలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు జరపాలని సూచించారు.
News March 21, 2026
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

రంజాన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.
News March 21, 2026
WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.


