News April 10, 2025
అమరజీవి జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం

పీసీ పల్లి మండలంలో ఈనెల 16వ తేదీన జరిగే అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి స్వామిని ఆర్యవైశ్య నాయకులు ఆహ్వానించారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను గురువారం కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 6, 2026
తమిళనాడు బోట్లను AP బార్డర్లోకి రానివ్వం: మంత్రి స్వామి

తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్య సంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగేబోటులో ఉన్న పోలీసులకు తుపాకులు అందజేసే అవకాశం ఉందన్నారు.
News April 6, 2026
తమిళనాడు బోట్లను AP బార్డర్లోకి రానివ్వం: మంత్రి స్వామి

తమిళనాడు, కడలూరు, పాండిచ్చేరిలకు చెందిన సోనాబోట్లు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడి మత్య సంపదను దోచుకెళ్తున్నాయని మంత్రి స్వామి అన్నారు. ఏపీ మత్య సంపద మనవారికే దక్కే విధంగా 4 హైస్పీడ్ బోట్లతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. తమిళనాడు బోట్లు ఏపీలోకి ప్రవేశించకుండా గస్తీ తిరిగేబోటులో ఉన్న పోలీసులకు తుపాకులు అందజేసే అవకాశం ఉందన్నారు.
News April 6, 2026
మార్కాపురం అటవీ శాఖలో ఉద్యోగాలు

మార్కాపురం అటవీ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం పలికారు. మార్కాపురం జిల్లాలో పనిచేయుటకు ఏదైనా డిగ్రీ కలిగి, MS ఆఫీస్, టైప్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కాపురం అటవీ శాఖ కార్యాలయానికి రావాలన్నారు.


