News April 10, 2025
ఆందోళన చేసినా అటవీశాఖ స్పందించలేదు: హరీశ్ రావు

TG: కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా అటవీశాఖ స్పందించలేదని BRS MLA హరీశ్ రావు అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘అటవీశాఖ స్పందించకపోవడంతో చెట్లు నరికేశారు. వాల్టా చట్టం ప్రకారం చెట్లు కొట్టాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అనుమతి ఇచ్చాకే కొట్టాలి. ప్రభుత్వ చర్యలతో 3 జింకలు చనిపోయాయి. పేదవాళ్లు ఒక్క చెట్టు కొడితేనే జైల్లో వేస్తారు. ప్రభుత్వమే వేలాది చెట్లను నరికేస్తోంది’ అని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
ఆందోళనలకు తలొగ్గం: బ్రిటన్ ప్రధాని

వలసలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న <<17705243>>నిరసనల్లో<<>> దాడులు జరగడాన్ని UK PM కీర్ స్టార్మర్ ఖండించారు. ‘జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న వారికి బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అధికారులపై దాడులు చేయడంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. కలర్, బ్యాగ్రౌండ్ ఆధారంగా ప్రజలను టార్గెట్ చేసుకోవడాన్ని అంగీకరించం’ అని స్పష్టం చేశారు.
News September 15, 2025
24 గంటల్లో 3 మ్యాచులు ఆడిన ప్రొటీస్ క్రికెటర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ జోర్న్ ఫార్టూయిన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే మూడు T20 మ్యాచులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. SEP 12న రా.6.30 గంటలకు మాంచెస్టర్లో ఇంగ్లండ్తో T20 మ్యాచ్ ఆడారు. 13న మ.2.30 గంటలకు బర్మింగ్హామ్లో జరిగిన T20 బ్లాస్ట్ సెమీఫైనల్లో హ్యాంప్షైర్ తరఫున పాల్గొన్నారు. హ్యాంప్షైర్ ఫైనల్కు దూసుకెళ్లడంతో ఆ వెంటనే రా.6.45 గంటలకు ఆ మ్యాచ్ కూడా ఆడేశారు.
News September 15, 2025
సమ్మె విరమించమని కోరాం: భట్టి

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.