News April 10, 2025
WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు బుధవారం ధర రూ.28వేలు పలకగా.. నేడు రూ.28,500 పలికింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,200 పలకగా.. ఈరోజు రూ.12,500కు తగ్గింది. 5531 మిర్చికి బుధవారం రూ.9,300 పలకగా నేడు రూ.9,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మక్కలు(బిల్టీ) రూ.2,295, పసుపు క్వింటాకి రూ.13,688 ధర వచ్చాయి.
Similar News
News March 25, 2026
HYD: సిటీని ఊపేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే!

నుమాయిష్ ఎగ్జిబిషన్లో Gen-Z మొదలుపెట్టిన కిర్రాక్ ట్రెండ్ సిటీని ఊపేస్తోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్లేట్లు పక్కనపెట్టి Cake in a Can పట్టుకుని రీల్స్ చేసిన కుర్రాళ్ళు.. ఇప్పుడు ఆ ట్రెండ్ని సిటీలోని పాప్-అప్ స్టాల్స్, ఇన్ఆర్బిట్ మాల్లోని ‘స్ట్రాబెర్రీ కార్నివాల్స్’కి షిఫ్ట్ చేశారు. స్ట్రాబెర్రీ ట్రీట్స్తో ‘Strawberry Stories’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అది అసలైన ‘వైబ్’ అంటున్నారు.
News March 25, 2026
హార్ముజ్: పాక్ నౌకకు ఝలక్ ఇచ్చిన ఇరాన్

పశ్చిమాసియా యుద్ధం వేళ పాక్కు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. హార్ముజ్ నుంచి కరాచీ వెళ్తున్న పాక్ నౌకను వెనక్కి రప్పించినట్లు IRGC తెలిపింది. హార్ముజ్ నుంచి వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదని, అందుకే అడ్డుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కాబూల్లోని ఇరాన్ కార్యాలయం ధ్రువీకరించింది. జలసంధి నుంచి వెళ్లే ప్రతినౌక ఇరాన్ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకుంటామని IRGC హెచ్చరించింది.
News March 25, 2026
వేసవి ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చేకూరి

వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ వినియోగం, అత్యవసర సేవల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయ శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. దీనికి సంబంధించి బుధవారం వివిధ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, తాగునీటి సరఫరా విభాగం, విద్యుత్, విద్యాశాఖలు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.


