News April 10, 2025

రామగుండంలో భూకంపం?

image

ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్‌ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్‌లో పేర్కొంది.

Similar News

News November 8, 2025

యూ.కొత్తపల్లి: మైనర్ బాలిక ఫిర్యాదు.. వ్యక్తి అరెస్ట్

image

యూ.కొత్తపల్లి మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో అంజిబాబు అనే యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తాను గర్భం దాల్చన తర్వాత పెళ్లికి నిరాకరించాడని బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News November 8, 2025

ఆండ్రాయిడ్ ఓల్డ్ వెర్షన్ యూజర్లకు BIG ALERT

image

దేశంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 13, 14, 15, 16 వెర్షన్ల(ఫోన్స్, ట్యాబ్లెట్స్)లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమీ, రియల్‌మీ, మోటోరోలా, వివో, ఒప్పో, గూగుల్ పిక్సల్ ఫోన్లపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. వెంటనే వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.

News November 8, 2025

పల్నాడు: నందికొండ పేరు ఎలా వచ్చిందో తెలుసా.!

image

పురాణాలలో పల్నాడు ప్రాంతాల ప్రస్తావన ఉంది. దక్షయజ్ఞ ధ్వంసం అనంతరం సతీ వియోగంతో శివుడు విసిగిపోయాడు. దీంతో అంగలు-పంగాలు వేసుకుంటూ తన వాహనమైన నందిని ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాంతంలో విడిచిపెట్టగా ఆ నంది నందికొండగా పేరు వచ్చింది. శిరమున ఉన్న చంద్రవంకను మాచర్ల ప్రాంత అడవులలో విడిచి పెట్టగా నేటి చంద్రవంక నదిగా మారింది. మెడలో నాగుపామును కనుముల ప్రాంతంలో విడిచి పెట్టగా అది నాగులేరుగా మారిందని ప్రతీతీ.