News April 10, 2025

కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

image

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.

Similar News

News September 15, 2025

నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

image

TG: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. రేపు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం WWW.TGICET.NIC.INను సందర్శించండి.

News September 15, 2025

ఆందోళనలకు తలొగ్గం: బ్రిటన్ ప్రధాని

image

వలసలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న <<17705243>>నిరసనల్లో<<>> దాడులు జరగడాన్ని UK PM కీర్ స్టార్మర్ ఖండించారు. ‘జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న వారికి బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అధికారులపై దాడులు చేయడంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. కలర్, బ్యాగ్రౌండ్ ఆధారంగా ప్రజలను టార్గెట్ చేసుకోవడాన్ని అంగీకరించం’ అని స్పష్టం చేశారు.

News September 15, 2025

24 గంటల్లో 3 మ్యాచులు ఆడిన ప్రొటీస్ క్రికెటర్

image

దక్షిణాఫ్రికా క్రికెటర్ జోర్న్ ఫార్టూయిన్ ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే మూడు T20 మ్యాచులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. SEP 12న రా.6.30 గంటలకు మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో T20 మ్యాచ్ ఆడారు. 13న మ.2.30 గంటలకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన T20 బ్లాస్ట్ సెమీఫైనల్‌లో హ్యాంప్‌షైర్ తరఫున పాల్గొన్నారు. హ్యాంప్‌షైర్ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆ వెంటనే రా.6.45 గంటలకు ఆ మ్యాచ్ కూడా ఆడేశారు.