News April 10, 2025

SKLM: సమస్యల పరిష్కారమే లక్ష్యం

image

గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణం పరిష్కరించే  దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్‌కి చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రీసర్వే, పీజీఆర్ఎస్, పౌర సేవల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

Similar News

News April 19, 2025

బూర్జ : స్విమ్మింగ్‌లో అరుదైన రికార్డు

image

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్‌గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.

News April 19, 2025

బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

image

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.

News April 19, 2025

శ్రీకాకుళం: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ గ్రామంలో జరిగిన వంటగ్యాస్ ప్రమాదంలో మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన జామి జయలక్ష్మి మార్చి 19వ తేదీన రాత్రి గ్యాస్ పేలి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

error: Content is protected !!