News April 10, 2025

సిరిసిల్ల: మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు నలుగురు మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా తీసుకోవలసిన భద్రత ఏర్పాట్లపై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అపెరల్ పార్క్‌లో టెక్స్ పోర్ట్ యూనిట్ ప్రారంభం చేస్తారన్నారు.

Similar News

News March 14, 2026

కర్నూలు: ఇద్దరు బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య

image

కర్నూలు మండలం గార్గేయపురం గ్రామ చెరువులో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు రాజేశ్వరి (35), అబ్రహం(3), సుకుమార్ (6)గా గుర్తించారు. భర్తతో మనస్పర్థల కారణంగా రాజేశ్వరి కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈమె పిల్లలతో సహా చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.

News March 14, 2026

మహిళ ఆత్మహత్య వీడియో వైరల్.. స్పందించిన సజ్జనార్

image

కళ్లెదుటే <<19370480>>భార్య ప్రాణాలు<<>> తీసుకుంటుంటే.. అడ్డుకొని కాపాడాల్సిన భర్త హేళన చేస్తూ వీడియో తీయడం అత్యంత విచారకరం. సమాజానికి సిగ్గుచేటని HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, పంతాలకు పోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేదాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడడం పైశాచికత్వం అని పేర్కొన్నారు. దయచేసి బంధాలకు విలువనివ్వాలని, క్షణికావేశంలో ఇలా చేస్తే ఆపాలన్నారు.

News March 14, 2026

మహిళ ఆత్మహత్య వీడియో వైరల్.. స్పందించిన సజ్జనార్

image

కళ్లెదుటే <<19370480>>భార్య ప్రాణాలు<<>> తీసుకుంటుంటే.. అడ్డుకొని కాపాడాల్సిన భర్త హేళన చేస్తూ వీడియో తీయడం అత్యంత విచారకరం. సమాజానికి సిగ్గుచేటని HYD సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ట్వీట్ చేశారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని, పంతాలకు పోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేదాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడడం పైశాచికత్వం అని పేర్కొన్నారు. దయచేసి బంధాలకు విలువనివ్వాలని, క్షణికావేశంలో ఇలా చేస్తే ఆపాలన్నారు.