News April 11, 2025
ప్రతీ కుటుంబం రూ. లక్ష ఆదాయం పొందాలి: కలెక్టర్

ప్రతీ కుటుంబం కనీసం లక్ష రూపాయలు ఆదాయం పొందాలని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జీవనోపాధి కల్పనలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం కనీసం లక్ష ఆదాయం సంపాదించాలని, ఇందుకు వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు, పశుసంవర్ధక సంబంధిత యూనిట్లు సిద్ధం చేయాలన్నారు.
Similar News
News March 28, 2026
విజయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం..!

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి (GGH) సాక్షిగా దారుణం జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతి తన తండ్రి చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, అక్కడ పరిచయమైన అమీన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను నమ్మించి కృష్ణలంకకు తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో, వారు మాచవరం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 28, 2026
డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి

డోర్నకల్-గద్వాల మధ్య 296km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుంది. ఈ లైన్ సింగరేణి బొగ్గు రవాణాకు & తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల కనెక్టివిటీకి, సామాజిక- ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జడ్చర్ల-నంద్యాల లైన్ ట్రాఫిక్ (182km) తక్కువగా ఉన్నట్లు తెలిపారు.
News March 28, 2026
నాగార్జునసాగర్ తీరంలో అంతర్జాతీయ సదస్సు!

నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు శనివారం సందర్శించనున్నారు. బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వీరు ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని అధికారుల సమాచారం. ఈ సందర్శన బౌద్ధ సాంస్కృతిక పరస్పర మార్పిడి, ప్రచారం, పరిశోధనలకు కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


