News April 11, 2025
రేషన్ కార్డు ఈ కేవైసీలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానం

రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పౌర సరఫరా శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. బాపట్ల జిల్లాలో మొత్తం 12,90,164 మంది రేషన్ దారులు ఉండగా వారిలో 12,08,479 మంది ఈ కేవైసీ చేయించుకున్నట్లు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు కాకుండా 69,202 మంది ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోనే 93.67%తో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News July 9, 2025
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందా?

AP: YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వెనకబడితే కొత్త మంత్రులు వస్తారని CM CBN ఇవాళ <<17007606>>వార్నింగ్<<>> ఇచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ మొదలైంది. నాగబాబుకు MLC పదవి దక్కిన తొలినాళ్లలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. ఉగాది తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారని భావించినా అలా జరగలేదు. తాజాగా CM చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
News July 9, 2025
వరంగల్ నిట్లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.
News July 9, 2025
కొంపల్లి రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్ దందా

HYDలో డ్రగ్స్ మాఫియా గట్టును మరోసారి ఈగల్ టీమ్ బట్టబయలు చేసింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్ను నడుపుతున్న ముఠాను పట్టుకుంది. రెస్టారెంట్ యజమాని సూర్య ఆధ్వర్యంలో ఈ దందా సాగుతోందని పోలీసులు తెలిపారు. సూర్య 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.