News April 11, 2025
NRPT: ‘పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి’

పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో పోషణ పక్షం గోడ పత్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలో ఊబకాయాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గర్భిణీలు, బరువు తక్కువగా ఉన్న పౌష్టికాహారం అందించాలన్నారు.
Similar News
News September 19, 2025
HYD: అమరవీరుల స్థూపం నుంచే పూల పండుగ

ఈ నెల 30న జరగనున్న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. TG అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2,500 మంది స్వయం సహాయక బృందాల మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరుతారు. కిక్కిరిసిపోయిన బతుకమ్మ ఘాట్ ఒక్కసారిగా కళకళలాడుతుంది. వీరికి స్వాగతం పలికేందుకు ఆకాశం నుంచి పూల వర్షం కురవనుంది. 2 టన్నుల పూలను హెలికాప్టర్ ద్వారా వెదజల్లి, బతుకమ్మ పండుగకు సరికొత్త అనుభూతిని తీసుకురానున్నారు.
News September 19, 2025
HYD: అమరవీరుల స్థూపం నుంచే పూల పండుగ

ఈ నెల 30న జరగనున్న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. TG అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2,500 మంది స్వయం సహాయక బృందాల మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరుతారు. కిక్కిరిసిపోయిన బతుకమ్మ ఘాట్ ఒక్కసారిగా కళకళలాడుతుంది. వీరికి స్వాగతం పలికేందుకు ఆకాశం నుంచి పూల వర్షం కురవనుంది. 2 టన్నుల పూలను హెలికాప్టర్ ద్వారా వెదజల్లి, బతుకమ్మ పండుగకు సరికొత్త అనుభూతిని తీసుకురానున్నారు.
News September 19, 2025
HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.