News April 11, 2025
శ్రీశైలం: అంగన్వాడీ సెంటర్లపై ఫుడ్ కమిషన్ చర్యలు చేపట్టేనా..?

శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లపై ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చర్యలు చేపడతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరం క్రితం నుంచి అంగన్వాడీ కేంద్రాలపై పలువురు ఫుడ్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మండల పరిధిలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ చిత్త ప్రతాపరెడ్డి తనిఖీలు చేపట్టారు. ఆయన పర్యటన నేపథ్యంలో అక్రమాలకు పాలుపడుతున్న సెంటర్లపై చర్యలు చేపట్టవలసిన అవసరం నెలకొంది.
Similar News
News February 24, 2026
గద్వాల: బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి: కలెక్టర్

జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్-12 కింద ఈ ఏడాది జనవరిలో 77 మందిని రక్షించామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,323 మంది పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి చేసి పునరావాసం కల్పించామని కలెక్టర్ వివరించారు.
News February 24, 2026
సిద్దిపేట: గర్భిణుల సంరక్షణపై ANMలకు ప్రత్యేక శిక్షణ

సిద్దిపేటలో గర్భధారణ నిర్వహణ నియమాలపై ANMలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. DMHO డాక్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో ARMMAN సంస్థ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో జరిగింది. గర్భిణీ నమోదు నుంచి ప్రసవం వరకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు మరణాల నివారణకు ANMలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News February 24, 2026
కేటీదొడ్డి: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య!

పనికి వెళ్లలేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన మహేశ్ (19) అనే యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది. తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేటీదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


