News April 11, 2025
జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయాడని సృష్టించి భూమి పట్టా

వ్యక్తి బతికుండగానే చనిపోయాడని కాగితాలు సృష్టించి అక్రమంగా ఓ వ్యక్తికి చెందిన భూమిని పట్టా చేసుకున్న ఘటన జనగామ మండలం అడవి కేశవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి ప్రభాకర్ ప్రకారం.. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి చెందిన 4.25 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన ఎల్లమ్మ అక్రమంగా పట్టా చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు.
Similar News
News January 10, 2026
సంక్రాంతి సెలవులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సంక్రాంతి అనగానే అంతా సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. క్యాష్, నగలు ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయండి. మీ ట్రావెల్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మీ ఇంటి దగ్గర పరిస్థితిపై మీకేమైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయండి.
News January 10, 2026
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు: ADB SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
News January 10, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది.


