News April 11, 2025
MNCL: 19న అంతరిక్ష విజ్ఞానంపై వెబినార్

భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 19న ఆన్లైన్లో వెబినార్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి, అభిరుచి కల్పించేందుకు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో పాల్గొనేందుకు ఈ నెల 17 లోగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. www.aryabhata.indiaspaceweek.org వెబ్ సైట్ సందర్శించాలన్నారు.
Similar News
News November 9, 2025
హన్వాడ: సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

ఈ ఏడాదికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆ రైస్ మిల్లులపై కట్టిన చర్యలు తప్పవని అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. శనివారం హన్వాడ మండల పరిధిలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాదికి సంబంధించి సీఎంఆర్ పూర్తిగా చెల్లించని రైస్ మిల్లులకు కొత్తగా కోటాను కేటాయించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 9, 2025
గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
పల్నాడులో చికెన్ ధరలు ఇవే..!

పల్నాడులో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ ధర రూ.200 నుంచి రూ.230, స్కిన్తో రూ.180 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి కేజీ రూ.108గా ఉంది. 100 కోడి గుడ్లు రూ.600గా ఉంది. మటన్ కేజీ రూ.800 నుంచి 900కి విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.


